స్వర్ణాంధ్ర@2047 లక్ష్యానికి మరో కీలక అడుగు! చిత్తూరులో మరో మెగా ప్రాజెక్ట్!
Tue Mar 04, 2025 09:10 Politics.202503049511.jpg)
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధిని సాధిస్తోంది. ఈ క్రమంలో కొత్త కంపెనీలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో మరో కంపెనీ అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి: గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో ఆయన అఖండ విజయం! 9 రౌండ్లలో లక్షా 45 వేల ఓట్లు!
ఏపీ సీఎం నారా చంద్రబాబు సోమవారం హీరో ఫ్యూచర్ ఎనర్జీకి సంబంధించిన రూ.1,000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును తిరుపతిలోని రాక్మన్ ఇండస్ట్రీస్లో వర్చువల్గా ప్రారంభించారు. ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ను పైప్డ్ నాచరల్ గ్యాస్, లిక్విఫైడ్ నాచరల్ గ్యాస్ తో మిక్స్ చేసి పరిశ్రమల్లో వేడి ఉత్పత్తి కోసం ఉపయోగించడానికి రూపొందించబడింది. ఇది పరిశ్రమల డీకార్బనైజేషన్లో ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేయబడిన తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఇదే అని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్లాంట్ 300 kW PEM ఎలక్ట్రోలైజర్ కలిగి ఉండగా.. 1.1 MWp సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్తుతో నడుస్తుంది. ఈ ప్లాంట్ LPGలో గ్రీన్ హైడ్రోజన్ను 10 శాతం, PNGలో 3 శాతం మిక్స్ చేయగలదు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది ఏడాది 25 టన్నుల (TPA) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో అవసరాలకు ప్లాంట్ ఉత్పత్తిని 54 TPA వరకు విస్తరించగలదని అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!
పర్యావరణంపై ఈ ప్రాజెక్ట్ ప్రభావాన్ని పరిశీలిస్తే.. 206 TPA కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గిరణలను తగ్గించి, 195 TPA ఆక్సిజన్ను వాయుమండలంలో విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు భారత క్లీన్ ఎనర్జీ వైపు వేస్తున్న అడుగులకు కొత్త మార్గదర్శినిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు హైడ్రోజన్ ఆధారిత పరిష్కారాలను ఆమోదించేందుకు ఇన్నొవేటివ్ పరిష్కారాలను అందిస్తుంది. పెద్ద మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా గ్రీన్ హైడ్రోజన్ను అనుసరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ శాశ్వతమైన స్వచ్చమైన ఎనర్జీ దిశగా ముందుకు పోవడం "SwarnaAndhra@2047" దృష్టిని అనుసరించడం అని అన్నారు.
రానున్న 5 ఏళ్లలో 160 GW పెరుగుదల శక్తి సామర్థ్యాన్ని కలిగించేందుకు 119 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు లక్ష్యంగా ఉంది. ఎక్కువ తీర ప్రాంతంతో పోర్టులను కలిగి ఉన్న ఏపీ తన లాజిస్టిక్ నెట్వర్క్తో పరిశ్రమలకు అనుకూల పాలసీలతో గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు గ్లోబల్ హబ్గా మారాలని భావిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం! రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!
పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్పై అరెస్ట్.. కోర్టు ముందుకు!
బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?
రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..
చిట్ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..
ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Andhrapradesh #APIndustrialBoom #GreenHydrogen #CleanEnergyRevolution #TirupatiDevelopment #AndhraPradeshGrowth #SustainableFuture #HydrogenEconomy #CarbonFreeFuture #RenewableEnergy #SwarnAndhra2047
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.